Friday, May 6, 2011

పుట్టపర్తి పులిహోర: సత్యసాయికి ప్రమోషన్ - శాశ్వత ఛైర్మన్‌, ట్రస్ట్‌ సభ్యులకు చెక్‌పవర్!

భక్తులకు పులిహోర!

Courtesy: ఈనాడు.net

సత్యసాయి ట్రస్ట్‌లో ముగ్గురు సభ్యులకు చెక్‌పవర్‌
పుట్టపర్తి, న్యూస్‌టుడే: సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు ఛైర్మన్‌ ఎంపిక, చెక్‌పవర్‌పై ఉత్కంఠకు తెరపడింది. గురువారం ప్రశాంతి నిలయంలో జస్టిస్‌ భగవతి అధ్యక్షతన జరిగిన ట్రస్టు సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు శాశ్వత ఛైర్మన్‌గా సత్యసాయిబాబా కొనసాగుతారని రత్నాకర్‌వెల్లడించారు. భవిష్యత్తులో జరిగే సమావేశాలకు ట్రస్టు సభ్యుల్లో ఒకరు అధ్యక్షుడిగా వ్యవహరించేలా తీర్మానించారు. ట్రస్టులోని సభ్యులు ఆర్‌.జె.రత్నాకర్‌, శ్రీనివాసన్‌, ఎస్వీ గిరిలకు చెక్‌పవర్‌ కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.